న్యూఢిల్లీ : జనరేటివ్ ఏఐ (AI) విస్తృతంగా అందుబాటులోకి వస్తుండటంతో లేటెస్ట్ టెక్నాలజీతో కొలువుల కోత తప్పదనే ఆందోళన నెలకొంది. మనుషులు చేసే ఎన్నో పనులను ఏఐ చేయగలుగుతుండటంతో లక్షలాది ఉద్యోగాలను ఈ టెక్నాలజీ రీప్లేస్ చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక లేటెస్ట్గా మరో అధ్యయనం ఏఐతో ఉద్యోగాలకు పెను ముప్పు తప్పదనే బాంబు పేల్చింది. భారత్లో అకౌంటెంట్లు, బుక్కీపర్స్ చేసే పనుల్లో 46 శాతం పనిని ఏఐ ఆటోమేట్ చేయనుంది.
ఏఐ విధ్వంసంతో కొలువుల కోత తప్పదని బ్రిటిష్ మల్టీనేషనల్ పబ్లిషింగ్, ఎడ్యుకేషన్ కంపెనీ పియర్సన్ అధ్యయనం స్పష్టం చేసింది. ఏఐతో బ్లూ కాలర్ జాబ్స్ కంటే వైట్ కాలర్ ఉద్యోగాలే అత్యధిక ముప్పును ఎదుర్కొంటాయని తేల్చిచెప్పింది. సంక్లిష్ట పనులను చక్కదిద్ది ఉత్పాదకతను పెంచేందుకు ఏఐ టూల్స్ ఉపయోగపడినా సంప్రదాయ ఉద్యోగాలు మాత్రం న్యూ టెక్నాలజీతో కనుమరుగవుతాయని తెలిపింది.
భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో వివిధ వృత్తులపై జనరేటివ్ ఏఐ ప్రభావం ఎలా ఉంటుందని పియర్సన్ నివేదిక వెల్లడించింది. ఆయా రంగాల్లో ఉద్యోగులు చేసే పనుల ప్రకారం తయారీ పరిశ్రమలోని కొలువులతో పోలిస్తే అడ్మినిస్ట్రేషన్ వంటి వైట్ కాలర్ జాబ్స్ ఏఐతో కుదించుకుపోయే అవకాశం ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ఇక భారత్లో వైట్ కాలర్ ఉద్యోగాల్లో 30 శాతం పనులను ఆటోమేట్ చేయవచ్చని, కార్మికులు చేసే పనులతో సహా 1 శాతం బ్లూకాలర్ జాబ్లను ఏఐ రీప్లేస్ చేయవచ్చని అధ్యయనం అంచనా వేసింది.
Read More :
Elon Musk | గ్రోక్ ఏఐ రాసిన కవితను షేర్ చేసిన మస్క్