న్యూఢిల్లీ : ప్రముఖ పీసీ బ్రాండ్ ఏసర్ భారత్ మార్కెట్లో సోమవారం న్యూ గేమింగ్ ల్యాప్టాప్ ప్రిడేటర్ హెలియోస్ 500ను లాంఛ్ చేసింది. 11 జనరేషన్ ఇంటెల్ కోర్ 19 ప్రాసెసర్తో ముందుకొచ్చిన ఈ ల్యాప్టాప్ రూ 3,79,999కు అందుబాటులో ఉంది. ఎన్విదియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 3080 ల్యాప్టాప్ జీపీయూ, 64 జీబీ, డీడీఆర్4 3200 ఎంహెచ్జ మెమర్, 4కే మినీ ఎల్ఈడీ డిస్ప్లే, 5 జన్ ఏరోబ్లేడ్ 3డీ ఫ్యాన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగిఉంది.
కస్టమర్లను థ్రిల్కు గురిచేసే అనుభూతిని మెరుగుపరిచే ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు ఏసర్ కసరత్తు సాగిస్తుంందని, భారత గేమింగ్ కమ్యూనిటీకి న్యూ పవర్ఫుల్ ప్రిడేటర్ హెలియోస్ 500ను పరిచయం చేస్తున్నామని ఏసర్ ఇండియా ముఖ్య వాణిజ్యాధికారి సుధీర్ గోయల్ తెలిపారు. సీమ్లెస్ గేమింగ్ యాక్షన్తో డెస్క్టాప్ క్యాలిబర్ సామర్ధ్యాన్ని ఇది అందిస్తుందని అన్నారు. ప్రిడేటర్ పల్సర్ లైటింగ్, పేటెంటెడ్ మెకానికల్ మ్యాగ్టెక్ స్విచ్లు, థండర్బోల్డ్ 4 యూఎస్బీ-సీ పోర్ట్స్, డీటీఎస్ ఎక్స్ అల్ట్రా సరౌండ్ సౌండ్ సిస్టం దీని ప్రత్యేకతలని ఏసర్ వెల్లడించింది.