ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న 1000 నగరాల్లో 5జీ టెక్నాలజీ విస్తరణ కోసం ప్లానింగ్ పూర్తయిందని జియో స్పష్టం చేసింది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో మరోవైపు 6జీ టెక్నాలజీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అలాగే దేశంలో 5జీ టెక్నాలజీని విస్తరించేందుకు కసరత్తులు చేస్తోంది. దానిలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ముందుగా 1000 నగరాల్లో 5జీ టెక్నాలజీని తీసుకురానుంది. దానికి సంబంధించిన ప్లానింగ్ మొత్తం ఇటీవలే పూర్తయింది.
అలాగే.. 5జీ టెక్నాలజీతో హెల్త్కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో ఆడ్వాన్స్డ్ యూజ్ కేసులను ఉపయోగించి జియో ట్రయల్స్ను ప్రారంభించింది. దానితో పాటు జియో ప్రీపెయిడ్ రీచార్జ్ను మరింత సులభతరం చేసేందుకు జియో.. ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్తో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే.. గత సంవత్సరం చివరి త్రైమాసికంలో డిసెంబర్ 2021 వరకు జియో నెట్ ప్రాఫిట్ 8.8 శాతం పెరిగినట్టు జియో వెల్లడించింది.
డిసెంబర్ 2021 వరకు కంపెనీ లెక్కల ప్రకారం జియోకు 42.1 కోట్ల కస్టమర్లు ఉన్నారు. 2020లో ఆ సంఖ్య 41 కోట్లుగా ఉండేది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడా పెరిగినట్టు కంపెనీ తెలిపింది.