తుర్కయాంజాల్, జనవరి 12 : రంగవల్లులు సంప్రదాయానికి ప్రతీకని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ అన్నారు. గురువారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్ మంగమ్మ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో మహిళలు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన మహిళలకు ఆమె బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
స్టేషన్ తిమ్మాపూర్లో..
కొత్తూరు : కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ తిమ్మాపూర్ శాంతినికేతన్ హైస్కూల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ కొస్గి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎలిమినేడు ప్రాథమిక పాఠశాలలో..
ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 12 : మండల పరిధిలోని ఎలిమినేడు ప్రాథమిక పాఠశాలలలో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కేశంపేటలో..
కేశంపేట : కేశంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎం ఈవో మనోహర్, జీహెచ్ఎం రసూల్, ఉపాధ్యాయులు అప్పారావు, నరేందర్రెడ్డి, జయసుధర, శశికళ, అనిత, సీఆర్పీ రామకృష్ణ పాల్గొన్నారు.
ఆదిబట్ల పాఠశాలలో..
ఆదిబట్ల : మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వర్కాల పరమేశ్ బహుమతులను అందజేశారు. అనంతరం స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బబ్లీ, పద్మావతి పాల్గొన్నారు.
నోముల పాఠశాలలో..
మంచాల : మంచాల మండలం నోముల ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజిరెడ్డి విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల ముగ్గులు వేసి ప్రతిభను కనబర్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీ 13వ వార్డు పరిధి తట్టిఅన్నారంలోని మారుతీనగర్లో కాలనీ హౌస్ ఓనర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించా రు. మహిళలు, యువతులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కోటేశ్వర్రావు, కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కరాచారి, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, దేవిడి విజయ్భాస్కర్రెడ్డి, పాశం దామోదర్, సుక్క భిక్షపతి, గోపాల్గౌడ్, బి.కృష్ణ, లహరి, సమంత, మానయ్య పాల్గొన్నారు.
కేజీబీవీలో..
కడ్తాల్ : మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ముగ్గుల పోటీ ల్లో గెలుపొందిన విద్యార్థునులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.