పెద్దఅంబర్పేట, జనవరి 8 : మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోని వ్యాస్ మాడల్ పాఠశాల విద్యార్థులు మల్కంబ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభను చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం నుంచి ఈ నెల 12 వరకు మధ్యప్రదేశ్లో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు పాఠశాల ప్రతినిధులు సర్వేశ్వర్రెడ్డి, కోచ్ నీలేశ్ అభినందనలు తెలిపారు.
బాలికల జట్టులో వెన్నెల, రేవతి, యశస్విని, కావ్య, రోహిత, బాలుర జట్టులో రామ్, రంజిత్, చరణ్, ప్రభు, పరశురాం ఉన్నట్టు నీలేశ్ చెప్పారు. మరోవైపు, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఎస్సార్ కాలేజీ విద్యార్థిని వెన్నెలను కాలేజీ ప్రిన్సిపాల్ సుధాధ, తెలంగాణ మల్కంబ్ అసోసియేషన్ సెక్రటరీ దిలీప్గవానీ, జిల్లా అసోసియేషన్ సెక్రటరీ దిలీప్ అభినందించారు.