వికారాబాద్ : సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా ముందుకు సాగాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. బుధవారం నవాబుపేట మండల పరిధిలోని పుల్మామిడి గ్రామంలో మహిళలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా డంపింగ్ యార్డులకు తరలించే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని సూచించారు. గ్రామం పరిశుభ్రంగా ఉంచుకుంటే, మనం అరోగ్యంగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విమలరంగారెడ్డి, ఎంపీటీసీ తేజస్విని రామకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్, కార్యదర్శి భానుప్రసాద్ పాల్గొన్నారు.