మోమిన్పేట : గ్రామాల్లో కలసికట్టుగా పారిశుద్ధ్యన్ని సాధించుకోవాలని జిల్లా అదనపు కటెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ కేంద్ర బృందం టీంతో గ్రామంలో పర్యటించి ప్రారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో పాటు వాడుకుంటూ బహిరంగా మల విసర్జన నిషేధించాలన్నారు. ఇంట్లో నుంచి మురికి నీరు రోడ్లుపైకి రాకుండా ఇంటింటికీ ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలన్నారు. తడి, పోడి చెత్త వేరు చేసి పంచాయతీ ట్రాక్టర్లో వేయాలని సూచించారు. పాఠశాల్లో అంగన్వాడీ, ఆరోగ్య, గ్రామ పంచాయతీ, దేవాలయలు, మసీదులు ప్రార్థన స్థలాలు, సాముహిక ప్రదేశాల్లో పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సంస్థ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహనపై పరిమాణాత్మక, గుణాత్మకమైన పరిశీలన సర్వే నిర్వహించి పారిశుధ్యంపై గ్రామాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్ర బృందం పరిశీలకులు రఘు, ప్రసాద్, ఎంపీడీవో శైలజారెడ్డి, ఎంపీవో యాదగిరి, ఏపీవో శంకర్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.