వికారాబాద్ : వికారాబాద్ పట్టణ సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందుతున్న అనంతపద్మనాభ స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శనివారం సెలవు దినం కావడంతో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి చిన్నారులు, పెద్దలు, యువత అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఆవరణలో భక్తులు సేదతీరారు. ఆలయ ఆవరణలో భక్తులు సెల్పీలు, ఫొటోలు దిగుతూ ఆనందగా గడిపారు.
అదే విధంగా రాష్ట్ర హై కోర్టు రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బుగ్గరామలింగేశ్వరాలయాన్ని సైతం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆలయ విశిష్టతలను తెలియజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి జ్ఞాపికను బహుకరించారు.