వికారాబాద్ : వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న అనంతపద్మనాభస్వామిని శుక్రవారం ఛత్తీస్ఘడ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మనోజ్ సింగ్ మండావి దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సుధాకర్రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.