వికారాబాద్, ఫిబ్రవరి 25 : బీడీ టీమ్, డాగ్ స్కాడ్ అధికారులు ఆదివారం వికారాబాద్, తాండూరు రైల్వే స్టేషన్లను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లాప్రజలను కోరారు. ప్రజలు 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. రైలులోని ప్రయాణికుల వస్తువులను బీడీ టీమ్, డాగ్ స్కాడ్ అధికారులు తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను పరిశీలించినట్లు తెలిపారు.