బొంరాస్ పేట : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొవిడ్ టీకా వేయాలని డీప్యూటీ డీఎంహెచ్వో రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకున్నపుడే కరోనా వైరస్ను నిర్మూలించవచ్చన్నారు. వైరస్ను నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా అందిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని రవీంద్ర యాదవ్ సూచించారు. కొవిడ్ వ్యాక్సిన్ వందశాతం సురక్షితమైనదని అపోహలు వీడాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి పాల్గొన్నారు.