ధారూరు : ప్రభుత్వం అనుమతులు లేకుండా బహిరంగా ప్రదేశంలో మధ్యం సేవిస్తూ న్యూసేన్స్ చేస్తున్న ఆరుగురు, మరో 14మందిపై కేసు నమోదు చేశామని ధారూరు ఎస్ఐ సురేష్ తెలిపారు. శనివారం రాత్రి వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్పల్లి ప్రాజెక్టు సమీపంలో రెండు గ్రూపులు టేంట్స్ వేసుకోని ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగా ప్రదేశంలో మధ్యం సేవిస్తూ న్యూసేన్స్ చేస్తున్నారు అన్న సమాచారం రావడంతో ధారూరు సీఐ తిరుపతి రాజు, ఎస్ఐ సురేష్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకోని మధ్యం సేవిస్తున్న 14మందిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. రెండు గ్రూపులను నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులు హైదరాబాద్ నగరానికి చెందిన 1. అనిల్, 2. ప్రవీణ్, 3. కార్తిక్, 4. షాహిల్, 5. మల్లేష్, 6. సురొజిత్లపై న్యూసేన్స్ చేస్తూ మధ్యం సేవించినందుకు రెండు కేసులు నమోదు చేశామని తెలిపారు.