కొత్తూరు రూరల్ : రోడ్డుపై అడ్డగోలు నిర్మాణాలను చేపట్టడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు ఆక్రమణలపై కొరడా జులిపించారు. రెండు రోజుల క్రితం కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామంలో కేశంపేట మండల కేంద్రానికి చెందిన చాపల నర్సింహ తన ద్విచక్రవాహనాన్ని హోటల్ ముందు పార్కింగ్ చేస్తున్న క్రమంలో టిప్పర్ ఢీకొని మృతిచెందటంతో స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ గ్రామంలోని ప్రధాన రహదారిపై ఆక్రమణలను గుర్తించి వాటిని జేసీబీతో కూల్చివేయించారు.
దుకాణాలు, హోటల్స్ ముందు పార్కింగ్కు స్థలాన్ని వదిలేసి నిర్మాణాలను చేసుకోవాలన్నారు. పార్కింగ్ స్థలాన్ని ఎవరైనా ఆక్రమణకు గురిచేస్తే యాజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అజయ్నాయక్, పోలీస్ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.