వికారాబాద్ : విద్యార్థులు పోటీ తత్వంతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి సతీమణి సీత పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ సహాయం చేస్తున్నామన్నారు. అలాగే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు సొంతనిధులతో అంబులెన్సులు, వికలాంగులకు ట్రైస్కూటర్లు పంపిణీ చేశామన్నారు. కరోనా సమయంలో నియోజకవర్గంలోని గ్రామాల్లో నిత్యవసర సరుకులను పంపిణీ చేశామని గుర్తు చేశారు. విద్యార్థులకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం పోటీలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎమ్మెల్యే ఆనంద్ సతీమణి డాక్టర్ సతితాఆనంద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్కుమార్, కౌన్సిలర్ నవీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.