-సిద్దుల గుట్ట జాతరకు భక్తులకు అనుమతి లేదు.
శంషాబాద్: శనివారం నుంచి ప్రారంభం కానున్న శంషాబాద్ శ్రీ వెండికొండ సిద్ధేశ్వరుడు ( సిద్దులగుట్ట) జాతర ఉత్సవాలకు కొవిడ్ నిబంధనల మేరకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సిద్దులగుట్ట జాతరకు భక్తులకు ఎలాంటి అనుమతులు ఉండవని ఆలయ కమిటి గౌరవాధ్యక్షులు కొత్త నర్సింహరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. యధావిధిగా ఆలయ అర్చకులు, ధర్మకర్తలమండలి, దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఉత్సవాల నిత్యకైంకర్యములు నిర్వహిస్తారని వివరించారు.
ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులు ఉత్సవాలకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్, ఆలయ వ్యవస్థాపక , ప్రధాన అర్చకులు మడపతి నరేందర్, ఆలయ కమిటి ప్రతినిధులు అరుణ్కుమార్, శంకర్రెడ్డి, పాండు, చక్రధర్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.