కడ్తాల్ : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ పని చేస్తున్నదని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం, వడ్డెర సంఘం భవనాల నిర్మాణాలకు, ఒక్కో భవనానికి రూ. 5లక్షల చొప్పున రూ. 10లక్షలు ఎంపీ నిధుల నుంచి రాములు మంజూరు చేశారు. భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రొసిడింగ్స్ను ఎంపీ రాములు టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయా సంఘాల నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీటను వేస్తున్నారని తెలిపారు.
కుల సంఘాలకు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాల నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన ఎంపీ రాములును ఆయా కుల సంఘాల నాయకులు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు భాస్కర్రెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నాయకులు గోపాల్రెడ్డి, యాదగిరిరెడ్డి, జహంగీర్అలీ, శ్రీకాంత్రెడ్డి, వంశీధర్రెడ్డి, శంకరయ్యగౌడ్, వెంకట్రాములుగౌడ్, శ్రీనివాస్గౌడ్, వెంకటేశ్, యాదయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.