చేవెళ్ల టౌన్ : రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై కమిటీ సభ్యుడిగా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ను ఎన్నుకున్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మర్పల్లి మాలతికృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మంగలి బాల్రాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శేరి శివారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ ఉన్నారు.