ఇబ్రహీంపట్నం : కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ గోరేటి వెంకటన్న అన్నారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు బుధవారం నగరంలోని మాసబ్ట్యాంక్లోని ఐఅండ్పీఆర్ కార్యాలయంలో ప్రెస్అకాడమని చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టుగా రాణిస్తున్న ఆదిబట్ల నమస్తేతెలంగాణ రిపోర్టర్ బృంగి శశివర్ణం కరోనాతో మృతిచెందడం అత్యంత బాధకరమని అల్లం నారాయణ అన్నారు.
ఆయన సతీమణి సంతోషికుమారికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 2లక్షల చెక్కును అందజేశారు. శశివర్ణం ప్రెస్అకాడమి జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.