రంగారెడ్డి, మే 28 (నమస్తే తెలంగాణ): ఏటా నిర్వహిస్తున్న ‘ప్రగతి’ పనులతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాయి. ఏ గ్రామం, పట్టణానికి వెళ్లినా పచ్చదనం, పరిశుభ్రతే కనిపిస్తున్నది. ఎప్పటిలాగే ఈసారి కూడా పల్లెప్రగతిని నిర్వహించేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జూన్ 3 నుంచి 18 వరకు ఐదో విడుత చేపట్టనుండగా.. పనులకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. ప్రధానంగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగిలిపోయిన వైకుంఠధామాల పనులను పూర్తి చేయడమే కాకుండా వీటికి భగీరథ నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. బృహత్ పల్లె ప్రకృతివనాల పనులను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు సన్నాహక సమావేశాలు సైతం పూర్తి చేశారు. పల్లె ప్రగతి కింద జిల్లాకు ఇప్పటివరకు రూ.104 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది.
ఐదో విడు త పల్లెప్రగతి కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జూన్ 3 నుంచి 18 వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో చేపట్టనున్న పనులకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో గ్రామ పంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లో పెండింగ్లో ఉన్న వైకుంఠధామాల నిర్మాణా ల పూర్తి, వాటికి భగీరథ ద్వారా నీటి సరఫరాతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం, పెండింగ్లో ఉన్న బృహత్ పల్లెప్రకృతి వనాలను పూర్తి చేయడం, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణాలను పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించారు.
ఇప్పటికే ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమానికి సంబంధించి జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సన్నాహక సమావేశంతోపాటు నియోజకవ ర్గ, మండల స్థాయిల్లో సన్నాహక సమావేశాలను కూడా నిర్వహించారు. కాగా ప్రభుత్వం ఇప్పటివర కు నిర్వహించిన నాలుగు విడుతల పల్లెప్రగతి కార్యక్రమాలతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎంతో మా ర్పు వచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో దర్శనమిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా పచ్చని మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. పల్లెప్రగతి కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు జిల్లాకు రూ.104 కోట్ల నిధులను ఖర్చు చేసింది.
జూన్ 3 నుంచి 18 వరకు..
ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గ్రామ పంచాయతీల్లో పాదయాత్ర నిర్వహించి గ్రామసభలను నిర్వహించనున్నారు. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, పల్లెప్రగతిలో సాధించిన విజయాలను చదివి వినిపించనున్నారు. ఇందులో జీపీ స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ పాల్గొననున్నా రు. అదేవిధంగా పల్లెప్రగతిలో భాగంగా జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు రోడ్లు, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, ఇండ్ల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపై పారకుండా ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి కుటుంబం ఇంకుడు గుంతల ను నిర్మించుకునేలా ప్రోత్సహించనున్నారు.
రెండు రోజులపాటు పంచాయతీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామాల్లోని ప్రభుత్వ ప్రజోపయోగ సంస్థల ను పరిశుభ్రం చేయనున్నారు. అదేవిధంగా గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్, హరితహారం ప్లాంటేషన్కు అనువైన ప్రదేశాలను గుర్తించనున్నారు. అదేవిధంగా ఒకరోజు పవర్ హాలీడేను నిర్వహించి గ్రామ పంచాయతీల్లోని విద్యుత్ సమస్యలను పరిష్కరించనున్నారు. డంపింగ్ యార్డు, వైకుంఠధామాన్ని సందర్శించడం, గ్రామస్తుల సహకారంతో శ్రమదానం నిర్వహించి పిచ్చిమొక్కలను తొలగించనున్నారు.
అదేవిధంగా గ్రామాల్లో పాడుబడిన బావులు, నిరుపయోగ బోరుబావులను పూడ్చివేయనున్నారు. గ్రామాల్లోని కాలువ గట్లు, చెరువు గట్లకు సంబంధించి నీటి పారుదల శాఖ అధికారుల సమన్వయంతో ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలను నాటనున్నారు. పల్లెప్రగతి కార్యక్రమం చివరి రోజున జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతోపాటు గ్రామాలు ఓడీఎఫ్, ఓడిఎఫ్ ప్లస్, మోడల్ అర్హత సాధించిన గ్రామాల వివరాలను అందులో ప్రకటించనున్నారు. అంతేకాకుండా పల్లెప్రగతిలో అత్యుత్తమ సేవలందించిన అధికారులను సన్మానించనున్నారు.
పెండింగ్ పనుల పూర్తికి చర్యలు
ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రధానంగా పెండింగ్ పనులను పూర్తి చేయడంపైనే దృష్టి సారి స్తాం. అంతేకాకుండా జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో రోజుకొక పనిని చేపడు తాం. కలెక్టర్, అదనపు కలెక్టర్ జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, పనుల్లో నాణ్యత లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.
– శ్రీనివాస్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి