పరిగి, మే 12: పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రతి నెలా నిధులు అందిస్తున్నది. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా గ్రామాలు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయి. ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాకు పల్లె ప్రగతి కింద రూ.303 కోట్లు అందాయి. ఈ నిధులతో డంపింగ్యార్డులు, కంపోస్టు షెడ్లు, వైకుంఠధామాల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రామపంచాయతీకో ట్రాక్టరు, ట్యాంకర్ కొనుగోలు చేసి మొక్కలకు నిత్యం నీటిని సరఫరా చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. దీంతో ఒకప్పుడు పెంట కుప్పలతో కంపుకొట్టిన గ్రామాల రహదారులు.. నేడు పల్లె ప్రగతి కార్యక్రమంతో పరిశుభ్రత, పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకే కొత్తందాన్ని తేవడంతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వైకుంఠధామం, డంపింగ్యార్డు తదితర వసతుల కల్పనతో సమస్యలు తీరాయి.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. గతం లో ఏ గ్రామానికి వెళ్లినా ముందుగా ఊరి బయ ట పెంటకుప్పలు.. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం దర్శనమిచ్చేది. కాగా పల్లెప్రగతి ద్వారా ప్రభుత్వం ప్రతినెలా గ్రామపంచాయతీల అభివృద్ధికి నిధులను విడుదల చేస్తుండటంతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీం తో గ్రామాలు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయి. 2019 సెప్టెంబర్ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం కాగా ఇప్పటివరకు జిల్లాలో ప్రభు త్వం నాలుగు విడుతలుగా నిర్వహించింది. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు గత ఫిబ్రవరి నెల వరకు సుమారు రూ.303 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 566 గ్రామపంచాయతీలున్నాయి.
పది శాతం నిధులు పచ్చదనానికి కేటాయింపు…
గ్రామపంచాయతీలకు విడుదలైన నిధుల్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద పచ్చదనానికి కేటాయించారు. 2019 సెప్టెంబర్ నుంచి ఆయా గ్రామపంచాయతీలకు విడుదలైన నిధులనుంచి పది శాతం ప్రత్యేకంగా పచ్చదనం కోసం ఖర్చు చేస్తున్నారు. ఇందులో పల్లె ప్రకృతివనాలు, హరితహారం కింద నర్సరీల్లో మొక్కల పెంపకం, మొ క్కలు నాటే కార్యక్రమం, వాటి సంరక్షణ తదితర కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేస్తుం డటంతో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్ బడ్జెట్ తెలంగాణలోని గ్రామపంచాయతీల్లో అమలవుతున్నది. మిగితా నిధులతో పంచాయతీల్లో పనిచేసే వర్కర్ల వేతనం, కరెంటు బిల్లులు పోను మిగిలిన డబ్బును అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.
ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్..
గ్రామ పంచాయతీల నిధులతో ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను కొనుగోలు చేశారు. చిన్న గ్రామ పంచాయతీలుంటే నిధులు సరిపోని పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించి ట్రాక్టర్లను కొనుగోలు చేసింది. దీంతో ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక ట్రాక్టర్ ఉన్నది. ఈ ట్రాక్టర్తో ఉదయం సమయంలో గ్రామంలోని ఇంటింటి నుంచి త డి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పొడి చెత్త ను డంపింగ్యార్డులో, తడి చెత్తను కంపోస్టు షెడ్డులో వేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న పెంటకుప్పలతోపాటు చెత్తాచెదారాన్ని తొలగించడంతో రోడ్లు శుభ్రంగా మారాయి. అంతేకాకుండా రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటడంతో పచ్చదనం సంతరించుకున్నది. ప్రతి పల్లెప్రకృతివనంలో ఎకర స్థలం లో నాలుగు వేల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా ఈ మొక్కలను ప్రతిరోజూ నీటిని అందిస్తున్నారు.
వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు..
జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లను ప్రభుత్వం నిర్మించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శ్మశానవాటికలకు స్థలం లేకపోవడంతో ప్రభు త్వం ప్రతి గ్రామపంచాయతీకి ఒక వైకుంఠధామాన్ని నిర్మించింది. ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి రూ.12 లక్షలు చొప్పున జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో రూ.67.92 కోట్లు వెచ్చించి వైకుంఠధామాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రతి గ్రామపంచాయతీలోనూ రూ. 2.5లక్షలు వెచ్చించి కంపోస్టు షెడ్లను నిర్మించిం ది. జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో వీటి నిర్మాణానికి రూ.14.15కోట్లు వెచ్చించింది. పల్లెప్రగతి కార్యక్రమం అమలు తర్వాత అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. కాగా జిల్లాలో మరోసారి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
ఇప్పటివరకు విడుదలైన నిధులు ఇలా..
2019 సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం ప్రతినెలా గ్రామపంచాయతీలకు నిధులను విడుదల చేస్తున్నది. 2019 సెప్టెంబర్లో రూ.12,77,82,600, అక్టోబర్లో రూ. 16,52,76,200, నవంబర్లో రూ.12,71,11,100, డిసెంబర్లో రూ. 12,71,68,900, 2000 సంవత్సరం జనవరిలో రూ.12,71,46,700, ఫిబ్రవరిలో రూ.12,71,10,800, మార్చిలో రూ. 8,89,46,000, ఏప్రిల్లో రూ.11,55,57,100, మేలో రూ.11,55,57,100, జూన్లో రూ.11,55,57,100, జూలైలో రూ.10,40,07,300, ఆగస్టులో రూ.10,40,07,300, సెప్టెంబర్లో రూ.10,38,20,000, అక్టోబర్లో రూ.10,39,41,808, నవంబర్లో రూ. 10,40,11,411, డిసెంబర్లో రూ.10,39,37,151, 2021 జనవరి నెలలో రూ. 10,39,55,710, ఫిబ్రవరిలో రూ.10,41,43,582, మార్చిలో రూ.10,37,63,994, ఏప్రిల్లో రూ.7,90,54,220, మేలో రూ.7,90,54,220, జూన్లో రూ.7,90,54,220, జూలైలో రూ.7,90,54,220, ఆగస్టులో రూ.7,37,42,530, సెప్టెంబర్లోరూ. 7,90,54,433, అక్టోబర్లో రూ.7,90,54,436, నవంబర్లో రూ.7,90,54,433, డిసెంబర్లో రూ.7,90,54,433, 2022 జనవరి నెలలో రూ.7,90,54,433, ఫిబ్రవరిలో రూ. 7,90,52,729 గ్రామపంచాయతీలకు నిధులు అందాయి. ఫిబ్రవరి నెల వరకు జిల్లాలోని 566 గ్రామపంచాయతీలకు రూ.303,70,86,163 ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి త్వరలోనే నిధులు విడుదల కానున్నట్లు అధికారులు తెలిపారు.
సుందరంగా గ్రామాలు
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సుందరంగా మారుతున్నాయి. ప్రభుత్వం ప్రతినెలా గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా నిధులను విడుదల చేస్తుండటంతో అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు మౌలిక వసతులను సమకూర్చుకుంటున్నా రు. ప్రతి గ్రామపంచాయతీలోనూ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. అంతేకాకుండా ట్యాంకర్లతో మొక్కలకు నీరు పోసి వాటిని సంరక్షిస్తున్నా రు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్ల నిర్మాణం పూర్తయింది.
–మల్లారెడ్డి, వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి
మారిన గ్రామాల స్వరూపం
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. నిత్యం ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరుగుతున్నది. ప్రతి ఏడాది రెండు విడుతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తే గ్రామాలు మరింత సుందరంగా మారుతాయి. గ్రామాల్లోని నర్సరీల్లో నాటి న మొక్కలు ఏపుగా పెరిగాయి. పల్లె ప్రకృతివనాలతోపాటు రోడ్ల పక్కన మొక్కల పెంపకంతో పచ్చదనం పెరిగి పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. గ్రామాలు అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నాయి.
–అశోక్వర్ధన్రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
పల్లె ప్రగతితో కొత్తరూపు
పల్లెప్రగతితో గ్రామానికి కొత్తరూపు వచ్చింది. ప్రభుత్వం ప్రతినెలా మంజూరు చేస్తున్న నిధులతో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, కంపోస్టు షెడ్, డంపింగ్ యార్డును నిర్మించాం. తడి, పొడి చెత్త సేకరణకు ఇంటింటికీ బుట్టలను పంపిణీ చేసి మహిళలకు అవగాహన కల్పించడం జరిగింది. పారిశుధ్య కార్మికు లు ప్రతిరోజూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం.
–రాజేశ్వరి, రేగడిమైలారం సర్పంచ్,బొంరాస్పేట మండలం