వికారాబాద్, నవంబర్ 26 : ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హాజరై మాట్లాడారు. చట్టాన్ని పరిరక్షించే బాధ్యత పోలీస్లపై పెట్టిందని, ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ మనపైన ఉందని వివరించారు. సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కొడంగల్లో..
కొడంగల్, నవంబర్ 26 : మండల పరిధిలోని అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండలంలోని హస్నాబాద్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రమేశ్బాబు, పట్టణ అధ్యక్షుడు జగన్మోహన్, బీసీ సంఘం నాయకులు భీమరాజు, పులిందర్గౌడ్, మాజీ సర్పంచ్ రమేశ్బాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సోమశేఖర్, డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.
హక్కులు, బాధ్యతలపై అవగాహన తప్పనిసరి
వికారాబాద్, నవంబర్ 26 : సుదీర్ఘమైన రాజ్యాంగంగా బీఆర్ అంబేద్కర్ తీర్చిదిద్దారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. శనివారం వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ప్రభు, కిషన్రావు, సంతోష్కుమార్, గంగాధర్, ప్రకాశ్, సుజాత, దివ్యరాణి, స్వప్న, వెంకటేశ్, శివకుమార్, యాదయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
చౌడాపూర్లో..
కులకచర్ల, నవంబర్ 26 : చౌడాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి, ఎంపీటీసీ శంకర్, నాయకులు బందయ్య, శ్రీను, బన్ని, కుమార్, సలీమ్, మహేశ్, విజయ్, నర్సింహులు, బాబా, శ్రీను, ఇస్మాయిల్, సుదర్శన్, యాదయ్య పాల్గొన్నారు.
కులకచర్ల కేజీబీవీ పాఠశాలలో..
కులకచర్ల మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో పాఠశాల ఎస్వో దేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
బంట్వారంలో..
బంట్వారం, నవంబర్ 26 : మండల కేంద్రంలో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భారత రాజ్యాంగం అత్యున్నతమైనది
మోమిన్పేట, నవంబర్ 26 : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యుతమైనదని, అలాంటి రాజ్యాంగాన్ని అందించిన ఘనత బీఆర్ అంబేద్కర్కు దక్కుతుందని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ మోమిన్పేట మండల అధ్యక్షుడు వెంకట్ అన్నారు. శనివారం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శైలజారెడ్డి, ఎంపీవో యాదగిరి, ఏపీవో శంకర్, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు నాయకులు ఉన్నారు.