పెద్దేముల్, నవంబర్ 24: అంతర పంటలతోనే రైతుల ఆదాయం మెరుగు పడుతుందని తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సుధాకర్ అన్నారు. గురువారం మండల పరిధిలోని రుద్రారంలో నాబార్డు సహకారంతో “రైతు నేస్తం ఫౌండేషన్” ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన రైతు నారాయణ వ్యవసాయ క్షేత్రంలో కంది పంటపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు, సేంద్రియ రైతులు మాట్లాడుతూ కంది లాభదా య కమైన పంటకాదని రైతులు అనుకుంటారని,అన్నిఅనుకూలిస్తే కందిలో అధిక దిగుబడులు సాధించి ఎకరానికి లక్ష రూపాయలని సంపాదించ వచ్చన్నారు. కందిలో అంతరపంటలుగా పెసర, మినుము, అల్లం లాంటి పంటలు వేసుకున్నట్లయితే ప్రధానపంటకు అయ్యేఖర్చులను సాధించవచ్చ న్నారు. సేంద్రియ సాగుకు కంది అనుకూలంగా ఉంటుందని,అధిక దిగు బడులు రావటానికి కందిలో తలలు తుంచవలసి ఉంటుంద న్నారు.
తలలు తుంచితే అధిక కొమ్మలు వచ్చి దిగుబడి పెరుగుతుందని వచ్చిన దిగుబడి విత్తనం కొరకు విలువ జోడించి కందిపప్పుగా మంచిధరకు అమ్ముకోగలిగితే కందిలో మంచి లాభం వస్తుందని రైతు నారాయణ తన అనుభవాన్ని తెలియజేశారు.అనంతరం సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు,ద్రావణాల గురించి సేంద్రియ రైతులు మనోహారచారి,హన్మంత్ రెడ్డిలు వివరించారు.అనంతరం రైతులకు అవగాహాన సదస్సు సర్టిఫికెట్లను అందించారు.కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ సందీప్, ప్రవీణ్కుమార్, యమునారెడ్డి,ఏడి రుద్రమూర్తి,సెరికల్చర్ ఏడి మల్లికార్జున్రావు,రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వర్ రావు, కంది పంటను పండిస్తున్న రైతులు పాల్గొన్నారు.