యాచారం, నవంబర్ 21: చదువుల తల్లి సరస్వతీ దేవి..ఆ తల్లికి మరో నిలయమే గ్రంథాలయం.. విజ్ఞాన సముదాయం, వినోద అంశాలకు సంబం ధించిన వందలాది పుస్తకాలు నేడు యాచారం గ్రం థాలయంలో అందుబాటులో ఉన్నాయి. సీఎం కేసీ ఆర్ ప్రభుత్వం ఉద్యోగ జాతరకు తెరలేపడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతీయువకులు, నిరు ద్యోగులు ప్రభుత్వ కొలువే లక్ష్యంగా కష్టపడుతున్నా రు. లైబ్రరీలోని వివిధ రకాల పోటీ పరీక్షలతో కుస్తీ పడుతున్నారు. గ్రంథాలయ నిర్వాహకులు కూడా ఉద్యోగార్థులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత కు అవసరమైన వివిధ రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నారు.
21 ఏండ్లుగా సేవలు
యాచారంలో ఉన్న శాఖ గ్రంథాలయం గత 21 ఏం డ్లుగా పాఠకులకు సేవలందిస్తున్నది. మండల కేం ద్రంలో లైబ్రరీ అవసరాన్ని గ్రంథాలయ సంస్థ గుర్తించిం ది. దీంతో జూన్6, 2000లో గ్రంథాలయ భవన నిర్మాణానికి అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పుష్పలీల శం కుస్థాపన చేశారు. ఫిబ్రవరి 1, 2001న నూతన గ్రంథాల య భవనాన్ని కూడా మంత్రి పుష్పలీలనే ప్రారంభించారు. అప్పటినుంచి మండలవాసులకు గ్రంథాలయ సేవలు అం దుతున్నాయి. ప్రతిఏటా వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్ర దర్శన, విద్యార్థులకు ఆటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందిస్తున్నారు.
15,000లకు పైగా పుస్తకాలు
యాచారం శాఖ గ్రంథాలయంలో సుమారు 15,000 లకు పైగా వివిధ రకాల పుస్తకాలున్నాయి. వీటిలో దిన, మాస, పక్ష పత్రికలు, బాల సాహిత్యం, నీతికథలు, భారత రాజ్యాంగం, గణితం, సైన్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇతిహాసాలు, జీవిత చరిత్రలు, సాహిత్యం, ఆధ్యాత్మికం, సినిమా, క్రీడావిశేషాలు, జనరల్ నాలెడ్జ్, స్పోకెన్ ఇంగ్లిష్, ఉచిత పోటీ పరీక్షల పుస్తకా లు, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, రాజకీయ నాయకుల చరిత్ర, తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో వివిధ రకాల పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉన్నా యి. ప్రతిరోజూ సుమారు 30 నుంచి 35 మందికిపైగా విద్యా ర్థులు, యువత, నిరు ద్యోగులు, ఉద్యోగార్థులు గ్రంథాలయానికి వచ్చి తమకు అవసరమైన పుస్తకాలను చదివి వెళ్తున్నారు.
ఆధునిక హంగులు..
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రంథాలయానికి కొత్త శోభ సంతరించుకున్నది. గ్రంథాలయ భవనానికి రంగులు వేయడంతోపాటు రీడింగ్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్డి, అవసరమైన టేబుళ్లు, కుర్చీలు, బీరువాలు, సరిపడా ఫర్నిచర్, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. పురాతన పుస్తకాలతోపాటు నూతన పుస్తకాలను పాఠకులకు అందుబాటులో ఉంచడంతో గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరు గుతున్నది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రజలు, యు వతీయువకులు, విశ్రాంత ఉద్యోగులు గ్రంథాలయాన్ని సందర్శించి తమకు అవసరమైన పుస్తకాలను చదివి వెళ్తున్నారు. ఉద్యోగార్థులు పోటీపరీక్షల పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
ఉద్యోగ సాధనకు సోపానం
ఉద్యోగార్థులు, నిరుద్యోగుల ఉద్యోగ సాధనకు గ్రంథాలయంలో లభించే వివిధ రకాల పుస్తకాలు ఎంతో దోహద పడుతున్నారు. వారు ఆ పుస్తకాలను ప్రతిరో జూ చదువుతూ జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. యాచారం శాఖ గ్రంథాలయంలోని వివిధ పుస్తకాల ను చదివి పలువురు ప్రభుత్వ ఉద్యోగాలను సాధిం చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. టీచర్లు, కానిస్టేబుళ్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలుగా ప్ర భుత్వ శాఖల్లో పనిచేస్తున్నారన్నారు. కోచింగ్ సెం టర్లకు వెళ్లలేని వారు కూడా గ్రంథాలయంలో లభిం చే వివిధ రకాల పోటీ పరీక్షల పుస్తకాలను చదివి ఉద్యోగాలను సాధించారు. ముఖ్యంగా పేద విద్యార్థులు, యువతకు గ్రంథాలయంలో దొరికే పుస్తకాలు ఎంతో దోహదపడుతున్నాయని గ్రంథపాలకులు పేర్కొంటున్నారు. యాచారంతోపాటు మొండిగౌరెల్లి, చౌదర్పల్లి, గాండ్లగూడ, మొగుళ్లవంపు, నక్కగుట్టతం డా, చింతపట్ల, తక్కళ్లపల్లితండా తదితర గ్రామాలకు చెందిన నిరుద్యోగులు, యువకులు గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలను చదివి తమ మేధస్సును పెంచుకుంటున్నారు.
లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి
సమాజాభివృద్ధిలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. యాచారం శాఖ గ్రంథాలయాన్ని మండల ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్క డ అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. శాఖ గ్రంథాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
-ముదిరెడ్డి శ్రీధర్రెడ్డి సర్పంచ్, యాచారం
అందుబాటులో అన్ని రకాల పుస్తకాలు
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, యువత గ్రంథాల యం సేవలను వినియోగించుకోవా లి. ఇక్కడ వివిధ రకాల పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉ న్నాయి. ఈ గ్రంథాలయంలోని పుస్తకాలను తరచూ చదువడంతోనే పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగాన్ని సాధించా. నాతోపాటు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు.
-మస్కు రమేశ్, యాచారం
యాచారంలోని శాఖ గ్రంథాలయం ప్రతిరోజూ 40 మందికి పైగా ..
యాచారం శాఖ గ్రంథాలయం వారానికి ఆరు రోజులపాటు అందుబాటు లో ఉంటుంది. శుక్రవారం సెలవు దినం కావడంతో మూసివేస్తాం. ప్రతిరోజూ 40 మందికిపైగా ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగార్థులు గ్రంథాలయానికి వస్తారు. వారికి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నాం.
-బొడ్డు సత్తయ్య నిర్వాహకుడు, యాచారం