కొడంగల్, నవంబర్ 16: సీఎం కేసీఆర్ పాలనలో రైతులు అద్భుతమైన సంక్షేమ పథ కాలను అందుకొని ఎంతో ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని అంగడిరైచూర్, చిట్లపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కొనుగోలు కేంద్రాలతో పాటు అంగడిరైచూర్లో హైమాస్ట్లైట్లు, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయా సమావేశాల్లో ఆయన మాట్లా డుతూ రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదన్నారు. కాబట్టే దేశంలోని ఏ రాష్ట్రంలో అమలులో లేని ఎన్నో అద్భుత సంక్షేమ పథకాలు తెలం గాణలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గతంలో వ్యవసాయం అంటే దండుగా అన్నట్లు గా రైతులు భావించే వారని, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వ్యవసాయాన్ని ఆత్మ గౌరవంతో చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు తగినట్లుగా వరుణుడు కరుణించడంతో పూర్తి స్థాయిలో చెరువులు, కుంటలు నిండుకొని సంవత్సరంలో రెండు పంటలు పండించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. గతంలో తెలంగాణలో వరి పంట పండిం చాలంటే ధాన్యం అమ్మకాలు జంకే పరిస్థితి ఉండేదని, నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో గిట్టుబాటు ధరతో గ్రామ గ్రామాన రైతు కొనుగోలుకేంద్రాలు ప్రారంభం కావడంతో రైతులు వరి పంటను పండించుకునేదుకు ధైర్యంగా ముందుకు వస్తున్నట్లు తెలిపారు. నేడు దేశంలోనే తెలంగాణలో అత్యధిక వరి పంట పండుతుందని, అన్నపూర్ణ తెలం గాణగా తులతూగుతున్నట్లు తెలిపారు.
రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రైతుభీమా పథకంతో రూ.5లక్షలు దరఖాస్తు చేసుకున్న వారంలో అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణలో అమలు కాబడుతున్న రైతు సంక్షేమ పథకాలకు ఆకర్శి తులై పక్కరాష్ట్రమైన కర్ణాటక రైతులు, ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణ సరిహద్దు కర్ణాటక ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కోరుకొంటున్నట్లు పేర్కొన్నారు. రైతు కష్టాలను తెలిసిన ముఖ్యమంత్రి కావడం పట్ల కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందుల లేని విధంగా ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్ గుప్తా, ఆయా గ్రామాల సర్పంచ్లు వెంకట్రెడ్డి, గోవింద్, శంకర్నాయక్. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.