షాద్నగర్రూరల్, జూలై 7 : పచ్చని చెట్లు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందజేస్తాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం ఫరూఖ్నగర్ మండలంలోని కిషన్నగర్లో సర్పంచ్ శ్రీశైలం నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. మారుమూల ప్రాంతాలకు బీటీ రోడ్డు వేయించామన్నారు. పల్లెప్రగతిలో గ్రామస్తులు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శివరాజ్, యాదవ్, ఉప సర్పంచ్ చెన్నయ్య, నాయకులు వెంకటేశ్గౌడ్, బుచ్చిలింగం గౌడ్, నాగలింగం పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనులు పకడ్బందీగా చేపట్టాలి
షాబాద్, జూలై 7 : పల్లెప్రగతిలో ప్రణాళిక పనులను పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని సర్దార్నగర్, పోతుగల్ గ్రామాలను సందర్శించారు. అనంతరం పల్లెప్రగతిలో భాగంగా పాత ఇండ్లను జేసీబీల సాయంతో కూల్చివేయించారు. హరితహారంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పల్లెప్రగతి ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రోడ్లపై చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలన్నారు. ప్రణాళికలో రోజువారీ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ ఆరుమొక్కలు పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షించేలా అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట సర్పంచులు స్వరూప, ఇస్మత్బేగం, ఎంపీవో హన్మంత్రెడ్డి, కార్యదర్శి మధుసూదన్రెడ్డి, మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఆయూబ్, మాజీ సర్పంచ్ నర్సింహులు, ఏపీవో వీరాసింగ్ ఉన్నారు.
స్వచ్ఛ గ్రామాలకు ప్రభుత్వం కృషి
షాబాద్, జూలై 7 : పల్లెప్రగతి ద్వారా స్వచ్ఛ గ్రామాలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీటీసీ అవినాశ్రెడ్డి, ఎంపీపీ ప్రశాంతిరెడ్డి అన్నారు. సోలీపేట్, మద్దూర్, హైతాబాద్, రుద్రారం గ్రామాల్లో హరితహారంలో మొక్కలు నాటి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు రమ్యకృష్ణ, నరేందర్రెడ్డి, మల్లేశ్, స్వర్ణలత, ఎంపీటీసీలు లత, చాంద్పాషా, మాజీ జడ్పీటీసీ మహేందర్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, నాయకులు రాంచంద్రారెడ్డి, యాదిరెడ్డి, రాంరెడ్డి, మహిపాల్రెడ్డి, దర్శన్ పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి
కొందుర్గు, జులై 7 : నాటిన ప్రతి మొక్కనూ బతికించాలని టెక్నికల్ అసిస్టెంట్ వినోద్కుమార్ అన్నారు. జిల్లెడు చౌదరిగూడ మండలంలోని వనంపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కవితగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో మారిన రూపు రేఖలు
మొయినాబాద్, జూలై 7 : పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని ఎంపీపీ నక్షత్రం అన్నారు. పల్లె ప్రగతిలో చేపడుతున్న పనులను పరిశీలించడానికి మండల ప్రత్యేకాధికారి, డీఆర్డీవో అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ నీరజతో కలిసి బుధవారం మండల పరిధిలోని మోత్కుపల్లి, చందానగర్ గ్రామాల్లో పర్యటించారు. మోత్కుపల్లి పంచాయతీ భవనంలో ఇతర సామగ్రి ఉండడంతో ప్రత్యేకాధికారి అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలను పరిశీలించారు. చందానగర్లో వైకుంఠధామానికి తోరణాన్ని వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీపీ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సమకూరుతున్నాయన్నారు. కార్యక్రమంలో చందానగర్ సర్పంచ్ సత్యమ్మ, ఎంపీడీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఇనుప స్తంభాల తొలగింపు
శంకర్పల్లి, జూలై 7 : పట్టణ ప్రగతిలో భాగంగా 7వ వార్డులో కౌన్సిలర్ అశోక్ విద్యుత్ ఇనుప స్తంభాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో మొక్కలు నాటామని చెప్పారు.
పక్కా ప్రణాళికతో నిర్వహించాలి
కొత్తూరు రూరల్, జూలై 7 : పల్లెప్రగతిలో భాగంగా అభివృద్ధి పనులను ప్రణాళికతో నిర్వహించాలని ఎంపీడీవో జ్యోతి అన్నారు. మండల పరిధిలోని శేరిగూడబద్రాయపల్లి గ్రామాన్ని బుధవారం ఎంపీడీవో సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. శ్మశానవాటికలో నాటిన మొక్కలను పరిశీలించారు. అభివృద్ధి పనులు మరింత ముమ్మరం చేయాలని సర్పంచ్కు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి
చేవెళ్లటౌన్, జూలై 7 : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో ఉరకలు వేస్తున్నాయని దామరిగిద్ద సర్పంచ్ వెంకటేశం గుప్తా అన్నారు. దామరిగిద్ద రోడ్లను మహిళ సంఘాలతో కలిసి శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఏపీవో సుశీల, వీవో సునీత పాల్గొన్నారు. దేవరంపల్లి గ్రామంలో శ్మశానవాటికలో చెత్తాచెదారని తొలగించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరహరిరెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి అక్బర్ పాల్గొన్నారు.