ధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో ఆదివారం పర్యటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టుకు పర్యటకులు భారీగా చేరుకున్నారు. ధారూరు మండల పరిధిలోని వారే కాకుండా వికారాబాద్ జిల్లా నలుమూలల నుంచి ప్రాజెక్టుకు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు హైదరాబాద్, మహబుబ్నగర్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, తదితర ప్రాంతాల నుంచి ప్రాజెక్టును చూసేందుకు కుటుంబ సమ్మెతంగా వచ్చారు.
ప్రాజెక్టులో చిన్నారులను సెల్పీలు దిగుతు సందడి చేశారు. అనంతరం ప్రాజెక్టులో బొటింగ్ చేశారు. ప్రాజెక్టు నీటిలో బోటును ఆపవద్దని, అధికంగా నీరు ఉన్న చోటుకు వేళ్లరాదని, ప్రాజెక్టు అవరణలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని పర్యటకులకు నిర్వాహకులు సూచించారు.