ఆదిబట్ల, ఫిబ్రవరి 10 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీడీఎస్ వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడైన నవీన్రెడ్డిపై రాచకొండ కమిషనర్ చౌహాన్ శుక్రవారం పీడీయాక్టు నమోదు చేశారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ సిరి టౌన్షిప్లో ఆర్మీ మాజీ ఉద్యోగి దామోదర్రెడ్డి తమ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతడి కుమార్తె వైశాలి బీడీఎస్ చదువుతున్నది. కాగా కొడుదుల నవీన్రెడ్డి అనే యువకుడు గతేడాది డిసెంబర్ 9న ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేయడం, బలవంతంగా పెండ్లి చేసుకుంటానని బెదిరించడంతో నిరాకరించింది. దీంతో అతడు ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతోపాటు.. ఆమె ఇంటిపై కొంతమందితో కలిసి దాడి చేసి ఇం ట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతోపాటు వైశాలిని కిడ్నాప్ చేశాడు.
యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన ఏ1 నిందితుడు కొడుదుల నవీన్రెడ్డితోపాటు కిడ్నాప్లో పాల్గొన్న మరో 40 మంది నిందితులను ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేసి గతేడాది డిసెంబర్ 13న రిమాండ్కు తరలించారు. ఇలాం టి ఘటనలు తిరిగి పునరావృతం కావొద్దనే ఉద్దేశంతో.. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాచకొండ కమిషనర్ చౌహాన్ అతడిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపారు.