వికారాబాద్, డిసెంబర్ 27 : గ్రామాల్లో నెల కొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మం గళవారం వికారాబాద్ మండల పరిధి లోని పులుసుమామిడి గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో పర్య టించి, ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేసి, అవస రమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని, వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పల్లె ప్రగతిలో చేయలేన టు వంటి పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయా లని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామంలో 6వ, 8వ వార్డుల్లో నీటి సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు చెప్పడంతో, సమస్య తెలుసుకొని గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి సరిపడా నీటిని అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ పైపులు లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాలని, నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని తెలి పారు. గ్రామంలో పశువులకు చికిత్స స్టాండ్ ఏర్పాటు చేసి, ప్రతి బుధవారం 9 గంటలకు గ్రామ పంచాయతీ ఆవరణలో అందుబాటులో ఉండాలని, పశువైద్య శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో నూతనంగా వేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ కమాల్రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షులు రాంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.