సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయంతో కూడిన ప్రోత్సాహం, నైపుణ్యా ల్లో ఉచిత శిక్షణ అందించేందుకు పీఎం విశ్వకర్మ పథకం ఎంతో తోడ్పడుతుందని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. తెలంగాణ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూ ర్ ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ స్కీంపై ఓరియేంటేషన్ సదస్సు గురువారం సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో జరిగింది. దీనికి ఎంఎస్ఎంఈ, పలు చేతి వృత్తిదారులు, కో-వే ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి స్కీంలో పేర్కొన్న వృత్తులకు ప్రత్యేక శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంపొందిస్తారని, శిక్షణ కాలానికి ప్రతిరో జూ రూ.500 ైస్టెఫండ్, ఉచిత వసతి సదుపాయం కల్పిస్తారన్నారు. ఆధార్, ఆధార్ అనుసంధానం చేయబడిన మొబైల్ నంబర్, రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లోనే ఎంపిక పూర్తవు తుందన్నారు.
అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్లోనూ ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన వారికి మూడు దశల్లో శిక్షణ ఉంటుందని.. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ, సర్టిఫికెట్ వంటి వి అందజేస్తారని తెలిపారు. దరఖాస్తు విధానం, కావాల్సిన దరఖాస్తులు, ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలపై ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ సుమతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఓరియేంటేషన్ సదస్సుకు 150కి మందిపైగా హాజ రు కాగా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్తోపాటు కోర్సు వివరాలు, స్కీం విధివిధానాలపై చేతివృత్తిదారులకు సలహాలిచ్చారు. కులవృత్తులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఫలాలను అందించడ మే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని కో-వే తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ చేతనజైన్ అన్నారు. కార్యక్రమంలో జీఎం-డీఐసీ ప్రీతీపవన్కుమార్, ఎంఎస్ఎంఈ అధికారులు శ్రీనివాసరావు, కో-వే ఇండియా సలహాదారు కరుణాగోపాల్, కో-వే వైస్ ప్రెసిడెంట్ కల్పనారావు, సెక్రటరీ నీరజాగోదావర్తి, కోశాధికారి నిషాఅగర్వాల్, జాయింట్ సెక్రటరీ అనురాధ కారటీ, నాయీ బ్రాహ్మణ సంఘం వైస్ ప్రెసిడెంట్ మల్లేశ్, గోల్డ్ స్మిత్ అసోసియేషన్ పిట్లంపల్లి రామలింగంచారి తదితరులు పాల్గొన్నారు.