షాద్నగర్రూరల్, జనవరి 28 : గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండంలోని మెండోనిరాయి తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ సుగుణతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పల్లెలను శుభ్రంగా ఉంచుకోవడం గ్రామస్తుల బాధ్యత అన్నారు.
సకాలంలో పన్నులు చెల్లిస్తే గ్రామాలను మరింత అభివృద్ధి పరుచుకోవచ్చన్నారు. అనంతరం తండావాసులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఉపసర్పంచ్ మంగ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు చల్లశ్రీకాంత్రెడ్డి, మాజీ ఎంపీపీ బుజ్జీబాబూనాయిక్, రూప్లానాయక్, రవీనాయక్, ఎస్టీసెల్ నాయకులు శ్రీనునాయక్, సంజూనాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజుగౌడ్, తేజ్యానాయక్, శ్రీనువాస్, దేశ్యానాయక్, వేణుగోపాల్, సూర్యనాయక్, దేశీయనాయక్, రమేశ్నాయక్, పాల్గొన్నారు.
నందిగామ : యువత క్రీడల్లోనూ రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్రెడ్డి, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కృష్ణ, కుమారస్వామిగౌడ్, నాయకులు రాంరెడ్డి, నర్సింహ, బాబర్ఖాన్, పురుషోత్తంరెడ్డి, రాములు, శివకుమార్, జంగయ్య, యువకులు పాల్గొన్నారు.