చేవెళ్లటౌన్, ఏప్రిల్ 22 : ఇంద్రారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. సోమవారం ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని చేవెళ్ల పట్టణంలోని అయన విగ్రహానికి, కౌకుంట్లలోని సమాధి వద్ద ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంద్రారెడ్డి కుమారులు కార్తిక్రెడ్డి, కౌశిక్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, రంగారెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ ఇంద్రారెడ్డి అందరినుంచి దూరమై 23 ఏండ్లు కావొస్తున్నా ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంద్రన్న కల, రాష్ట్రం ఏర్పడి మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో సుపరిపాలన కొనసాగిందన్నారు. ఇంద్రన్న అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అశయ సాధనకు కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాల్రాజ్, మాజీ వైస్ ఎంపీపీ ప్రసాద్, మండల అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల మండల సర్పంచ్ల సంఘం మాజీ మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి, మాజీ సర్పంచ్లు నరహరిరెడ్డి, మల్లారెడ్డి, మోహన్రెడ్డి, ప్రభాకర్, ఎంపీటీసీ సత్యనారాయణచారి, శంకర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాపారావు, చేవెళ్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు గిరిధర్రెడ్డి, నర్సింహులు, డైరెక్టర్లు వెంకటేశ్, మహేశ్, సాయినాథ్, గుడిమల్కాపూర్ డైరెక్టర్లు మంగలి యాదగిరి, నాయకులు మహేందర్, శేఖర్రెడ్డి, చింటు, శ్రీకాంత్, రాఘవేందర్ఎడ్డి, చందు, ఎల్లయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.