కులకచర్ల, మార్చి 29: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పీఏసీ ఎస్ సర్వసభ్య సమావేశం చైర్మన్ కనకం మొగులయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బంధు సాయం అందించడంతో పాటు రానున్న రోజుల్లో సబ్సిడీకి విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
సోసైటీల ద్వారా వివిధ ఫుడ్ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, దీని ద్వారా చాలా మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. సోసైటీ రూ. మూడు కోట్ల 11లక్షల లాభాన్ని ఆర్జించడం గొప్పవిషయమన్నారు. మహారాష్ట్ర కోపరేటీవ్కు సంబంధించి సోసైటీ ద్వారా చక్కెర కర్మాగారాలను ఏర్పాటు చేసి చెరుకు పండించేవారికి సబ్సిడీ రుణాలు అందించి, కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుంటున్నారని, అదే విధంగా మనరాష్ట్రంలో కూడా చేయాలని సూచించారు. రైతులు పండించిన పంటలు నిల్వ ఉంచేందుకు కోల్డ్స్టోరేజిలను నిర్మించాలని, ప్రాసెసింగ్ వస్తులకు మార్కెటింగ్ కల్పించాలన్నారు.
ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్నా మని, నిధుల కొరతతో కొంత ఆలస్యం అవుతుందని తెలిపారు. రెండు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉంటే కరెంట్ బిల్లు చెల్లించకూడదని తెలిపారు. విద్యుత్ అధికారులు ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహాలు మం జూరయ్యాయని, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన వెంటనే వాటిని అర్హులకు అందిస్తామని అన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది కులకచర్ల మండలమేనని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. తనను భారీ మెజారిటీతో గతంలో జడ్పీటీసీగా గెలిపించారని, ఆతరువాత ఏకగ్రీవంగా పీఏసీఎస్ చైర్మన్గా ఎన్నుకున్నారన్నారు.
తరువాత తనను డీసీసీబీ చైర్మన్గా ఎన్నుకున్నారని తెలిపారు. కులకచర్లలో చేసిన సేవలకు ప్రతిఫలమే తాండూరు ప్రజలు ఆదరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, డీసీసీ ఉపా ధ్యక్షుడు భీంరెడ్డి, బ్లాక్2 అధ్యక్షుడు కర్రె భరత్కుమార్, కులకచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీఎస్ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోపాల్నాయక్, చౌడాపూర్ అధ్యక్షుడు అశోక్, పీఏసీఎస్ సీఈవో బక్కారెడ్డి, సోసైటీ డైరెక్టర్లు, కులకచర్ల ఎంపీటీసీ ఆనందం, నాయకులు కొండయ్య, కృష్ణారెడ్డి, నర్సింహులు, యాదయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.