తుర్కయాంజాల్, ఫిబ్రవరి 23: తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విస్తరణకు స్థలం కేటాయించాలని కోరుతూ శుక్రవారం ఇంజాపూర్వాసులు ధన్రాజ్, బొక్క వంశీధర్రెడ్డి, మల్లెల మైసయ్య ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ పాఠశాలలో 278 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. పాఠశాల భవన నిర్మాణం 150 గజాలల్లో ఉండడంతో ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు వివరించారు.
ఇటీవల పీఎంశ్రీ పథకం కింద రూ.54లక్షలు విడుదలయ్యాయని, వచ్చే నాలుగేండ్లలో మరో రూ.2కోట్ల నిధులు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం 1500 గజాల స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో తుర్కయాంజాల్ మున్సిపల్ కౌన్సిలర్లు కంబాలపల్లి ధన్రాజ్, కాకుమాను సునీల్, శివలింగం గౌడ్, బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు ధన్రాజు, యాదగిరి, దర్శన్ పాల్గొన్నారు.