బంజారాహిల్స్ : ముచ్చింతలలోని శ్రీరామ నగరంలో త్రిదండి చిన్నజీయర్స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు ఏసిన సమతామూర్తి విగ్రహాన్ని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. భగవంతుడి సేవలో కులమతాలకు అతీతంగా అందరూ సమానులే అనే సందేశాన్ని చాటిచెప్పిన జగద్గురు రామానుజుల విగ్రహాన్ని 216 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయడంతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లోని 108 ఆలయాలను ఒకే చోట దర్శించునే అవకాశం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
హైదరాబాద్ నగరానికి మరో కీర్తికిరీటంగా సమతామూర్తి విగ్రహం మారిందని పేర్కొన్నారు.