కడ్తాల్, డిసెంబర్ 13 : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెంచుల లబ్ధిదారులకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 17 బోరు మోటర్లు, 16 కుట్టు మిషన్లు, 41 గేదెలకు సంబంధించిన ప్రొసీడింగ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం కడ్తాల్, ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, రాష్ట్ర నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, డీటీడీవో రామేశ్వరీదేవి, తహసీల్దార్ ముంతాజ్, ఎంపీడీవో రామకృష్ణ, లోన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చెంచు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, శంకర్, విజయలక్ష్మి, రవీందర్, సుగుణ, నాగమణి, ఎంపీటీసీలు రాములుగౌడ్, ఉమావతి, నిర్మల, లక్ష్మణ్నాయక్, పాండు, మహేశ్, రాజేందర్, రాజేశ్, భానుకిరణ్ తదితరులు పాల్గొన్నారు.