ఉప్పల్, మే 24 : నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నాచారంలోని బాబానగర్లో రూ.98 లక్షలతో బాక్స్ కల్వర్టు పనులను సోమవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. బాక్స్ కల్వర్టుల నిర్మాణం ద్వారా వరద నీటి సమస్యలు తీరుతాయన్నారు. కాలనీల్లో వరదనీరు నిల్వకుండా, రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, డీఈ రూప, ఏఈ రాకేశ్, నాచారం సీఐ కిరణ్కుమార్, నేతలు సాయిజెన్ శేఖర్, మేకల ముత్యంరెడ్డి, పోగుల వెంకటరమణారెడ్డి, కట్ట బుచ్చన్న, గరిక సుధాకర్, విజయభాస్కర్, శ్రీరాం సత్యనారాయణ, డి.శ్రీనివాస్, మహేందర్, అహ్మద్, భాస్కర్, గడ్డం శ్రీనివాస్, సంతోష్, శివకుమార్, యూనూస్ తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి, మే 24 : నియోజకవర్గం పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని జేకేనగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి డప్పు గిరిబాబు, డివిజన్ సీనియర్ నాయకులు రెడ్డినాయక్, కర్రె సత్యనారాయణ, గరిక సుధాకర్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్ వంశరాజ్, జంపన్నయాదవ్, లక్ష్మణ్, కరుణాకర్, వెంకటేశ్, కృష్ణ, సుధాకర్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.