ఉప్పల్, మే 20 : లాక్డౌన్లోను అభివృద్ధి పనుల్లో రాజీపడబోమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రమీలకు రూ.24 వేలు, ప్రసన్నకు రూ.28 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, నేతలు గరిక సుధాకర్, జేసీబీ.రాజు, ప్రశాంత్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
లాక్డౌన్ను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పరిశీలించారు. ఈమేరకు హబ్సిగూడలోని చౌరస్తాలో లాక్డౌన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజలు భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడంపై అవగాహన కల్పించారు. కరోనా నిబంధనలు, లాక్డౌన్ తప్పనిసరిగా పాటించే విధంగా చూడాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో ఓయూ సీఐ రమేశ్, గరిక సుధాకర్, చింతల నర్సింహారెడ్డి, గొరిగె ఐలేశ్, జేసీబీ.రాజు, ప్రశాంత్గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
చర్లపల్లి: చర్లపల్లి డివిజన్ పరిధిలోని భరత్నగర్ రైల్వే క్రాసింగ్ ఆర్ఓబీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని భరత్నగర్ కాలనీవాసులు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణ పనులు సగం పూర్తయ్యాయని, మిగతా పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్, పట్టణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీంతో వారు పనుల కోసం మూడు కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. భరత్నగర్, పారిశ్రామికవాడ ఫేజ్-3లోని స్థానికులు, కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రైల్వే క్రాసింగ్ గెట్లు మూసివేయడంతో ఎనిమిది కిలో మీటర్లు చుట్టూ తిరిగి చర్లపల్లికి చేరుకోవాల్సి వస్తున్నదని, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి రైల్వే క్రాసింగ్ గెట్లు తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాలుగు నెలల్లో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
శివసాయినగర్ కాలనీ ఫేజ్-3లోని నాలాపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 50లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. డివిజన్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.