మున్సిపల్ పరిధిలోని ఐదు నర్సరీల్లో చాలా రకాల మొక్కలను పెంచారు. అటవీశాఖ, ఉద్యానవన అధికారుల సూచనలు, సలహాలతో మొక్కల పెంపకం చేపట్టారు. నర్సరీల్లో మామిడి, అల్లనేరెడు, తులసీ, మనీప్లాంటు, ఉసిరి, పొప్పడి, కానుగ, వేప, రాగి, మందారంతో పాటు అనేక రకాల మొక్కలు నాటేందుకు, పంపిణీకి సిద్ధం చేశారు. ఉద్యానవన, అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందిని నర్సరీల్లో నియమించి మొక్కల పెంపకాన్ని నిర్వహిస్తున్నారు. హరితహారంలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.
ఈసారి భారీగా మొక్కలు నాటేందుకు నర్సరీల్లో పెద్ద ఎత్తున పెంచాం. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో క్రమం తప్పకుండా నీటిని అందించడంతో పాటు ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. వర్షాలు కురువగానే పార్కు లు, ఖాళీ స్థలాల్లో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతాం. -వాణిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగారం