చర్లపల్లి, మే 17: నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్యలు తలేత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్లో సుమారు రూ.1కోటి 92లక్షల వ్యయంతో చేపట్టిన తాగునీటి పైపులైన్ పనులను కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష, మాజీ కార్పొరేటర్లు పావని, కొత్త రామారావు, వాటర్వర్క్స్ అధికారి కృష్ణలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని కమలానగర్, మహేశ్నగర్లో మూడు దశాబ్దల క్రితం వేసిన పైపులైన్ నిర్మాణంతో ఇబ్బందులు వస్తున్నాయని స్థానికుల ఫిర్యాదు మేరకు నూతన పైపులైన్ పనులు చేపట్టామని ఆయన తెలిపారు. డివిజన్లో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. అదే విధంగా డివిజన్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెపెక్టర్లు సహదేవ్, సత్తయ్య, టీఆర్ఎస్ నాయకులు బేతాల బాల్రాజు, సురేందర్, మణిపాల్రెడ్డి, కుమార్స్వామి, బాజీబాషా, శ్రీనివాస్రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, మోహన్రావు, కాలనీవాసులు బాల్రాజు, ఎంఎన్ చారి, పెంటయ్యగౌడ్, వెంకటహరి, యాదగిరి, సత్యనారాయణ, మహిపాల్రెడ్డి పాల్గొన్నారు.
కుషాయిగూడ, భాగ్యనగర్ కాలనీలో సుమారు రూ. 94లక్షల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పైపులైన్ పనులను స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన కాలనీలో పర్యటిం చి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు, సీసీఎస్ ప్రతినిధి పద్మారెడ్డి, కుషాయిగూడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సోమశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి, పాండాల శివకుమార్గౌడ్, విద్యసాగర్, యాదగిరి, సత్యనారాయణ, వెంకటేశ్, రమేశ్, బాబుగౌడ్, కిషోర్గౌడ్, చక్రపాణిగౌడ్, శ్రీకాంత్యాదవ్, శంకర్, నర్సింగ్రావు, ప్రభుగౌడ్, రాజుగౌడ్, దినేశ్ పాల్గొన్నారు.
కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం ఏఎస్రావునగర్, కాప్రా, చర్లపల్లి డివిజన్ పరిధిలో చేపట్టిన రసాయన పిచికారీ పనులు, పారిశుధ్య నిర్వహణ పనులను ఆయన సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పారిశుధ్య పనులను వేగవంతం చేస్తున్నామని, పలు డివిజన్ల పరిధిలో రసాయన పిచికారీ పనులను ముమ్మరం చేయడంతో పాటు కొవిడ్ పరీక్షలను వేగవంతం చేయాలని సూచించారు.