టీఆర్ఎస్లో చేరిన పలు పార్టీల నాయకులు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కొడంగల్, ఫిబ్రవరి 6 : సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషికి ఆకర్శితులై పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మద్దూర్ మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సాయప్పతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు హనుమంతు, లాలప్ప, భీమప్ప తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి కాకుండా తమ పదవులను కాపాడుకునేందుకు నాయకులు పాలన చేపట్టినట్లు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అవసరాలను గుర్తించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కార దిశగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన్ని సందర్శించి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కలిసి కట్టుగా నియోజవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా పాటుపడదామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, బొంరాస్పేట నాయకులు చాంద్పాషాతో పాటు మద్దూర్ టీఆర్ఎస్ నాయకులు వీరారెడ్డి, శివకుమార్, నర్సింహులు పాల్గొన్నారు. తొలి విడుత లబ్ధిదారుల జాబితా సిద్ధం