కొత్తూరు రూరల్ : హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కొత్తూరు మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో వాతావరణ ఆధారిత పంటల సాగు వివరాలు, సాంకేతిక పద్దతులు, పంటల రకాలు వంటి వాటిపై ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడారు. రైతులు పండిస్తున్న పంటలు, సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ సుధారాణి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రఘురామిరెడ్డి, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ శైలజ, గూడూరు సర్పంచ్ సత్తయ్య, రైతులు మల్లారెడ్డి, యాదయ్య, బాలయ్య, రమేశ్, మోడి దర్శన్, చంద్రయ్య, ప్రేమ్కుమార్, నర్సింగ్రావు, విఠలయ్య, నర్సింహ పాల్గొన్నారు.