రంగారెడ్డి, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించేలా చక్కటి కార్యాచరణతో సన్నద్ధం కావాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూ చించారు. రాష్ట్రం ఏర్పాటై పదేండ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం షె డ్యూల్ ప్రకటించినదన్నారు. శనివారం రంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు ప్రతీక్జైన్, తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియలతో కలిసి ఆయా శాఖలు చేపట్టాల్సిన కార్యక్రమాల పై తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో ఆయా శాఖలు జూన్ 2, 2014 నుంచి నేటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతి, లబ్ధిదారుల వివరాలు, చేసిన ఖర్చుతోపాటు గ్రామ, నియోజకవర్గ, ము న్సిపాలిటీ స్థాయిలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారో వాటి నివేదికలను అందించాలని సూచించారు. నాడు-నేడు పేరుతో అప్పటి పరిస్థితి-నేటి ప్రగతి ద్వారా మా ర్పు స్పష్టంగా తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అదేవిధంగా కరపత్రాలను ము ద్రించి కార్యక్రమం రోజు ప్రజలకు పంపి ణీ చేయాలన్నారు. లబ్ధిదారుల విజయగాథలు, అభిప్రాయాలను నలుగురికి తెలుపాలన్నారు. తమ కార్యక్రమాల రోజు ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులను ఆహ్వానించాలని,నిర్దేశించిన రోజుల్లో సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వెంటనే అన్ లోడింగ్ చేయాలి
రైస్ మిల్లర్ల నిర్వాహకులు ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేసుకోవాలని కలెక్టర్ హరీశ్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లయ్ చైర్మన్ రవీందర్సింగ్, అదనపు కలెక్టర్ తిరుపతిరావుతో కలిసి కలెక్టర్ రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో తమ డిమాండ్లను రైస్ మిల్లర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ధాన్యం నిల్వలను అన్లోడింగ్ చేసుకోవాలని, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని కలెక్టర్ వారికి సూచించారు. సమావేశం లో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మనోహర్ రాథోడ్, సివిల్ సప్లయ్ డీఎం శ్యా మారాణి, అధికారులు పాల్గొన్నారు.
29న ప్రజావాణి రద్దు
దశాబ్ది ఉత్సవాల సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నందున ఈ నెల 29వ తేదీ సోమవారం నాడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు రంగారెడ్డి కలెక్టర్ హరీశ్ తెలిపారు. తిరిగి వచ్చే సోమవారం నుంచి యథాతథంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
బ్రేవరీ అవార్డ్స్కు దరఖాస్తు చేసుకోండి
ధైర్యసాహసాలు కనబర్చిన పిల్లలకు పంపిణీ చేసే నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ ఫర్ చిల్డ్రన్కు అర్హులైన చిన్నారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. www.iccw.co.in వెబ్సైట్లో అక్టోబర్ 15, 2023 సాయం త్రం 5 గంటల్లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.