మాదాపూర్, ఫిబ్రవరి 3: మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డెయిరీ, ఫుడ్ ఎక్స్ పో- 2023ను హోంమంత్రి మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమ భరత్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ … నగరానికి ప్రతి రోజు కోటి లీటర్ల పాలు అవసరమవుతాయని, కానీ 60 నుంచి 70 లక్షల లీటర్లు ఉత్పత్తి మాత్రమే అవుతున్నదన్నారు. టీఎస్డీడీసీఎఫ్ సోమ భరత్ మాట్లాడుతూ… విజయ డెయిరీ ఎ వరూ ఊహించనంత గొప్పగా ఎదిగిందని చెప్పా రు. రూ.7 వందల కోట్ల టర్నోవర్ సాధించి వెయ్యి కోట్ల లక్ష్యంతో ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా విజయ డెయిరీ మరో 2 వేల ఔట్లెట్లను జోడించేందుకు సిద్ధమవుతున్నదని, ప్రస్తుతం వెయ్యి అవుట్ లెట్లను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 27 రకాల ఉత్పత్తులు ఉండగా మిల్క్ షేక్, కాఫీ, టీ, ఫ్లేవర్డ్ మిల్క్, ఐస్ క్రీం, కుల్ఫీ, కుకీలు, హెల్త్ బార్లు మొదలైన 100 రకాల కొత్త ఉత్పత్తులను జోడించనున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని అత్యవసర పరిస్థితుల ఆధారంగా త్వరితగతిన నిర్వహించే యానిమల్ మొబైల్ మెడికల్ అంబులెన్స్లు వందల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని, టోల్ ఫ్రీ నంబర్ 1962 అంబులెన్స్ సేవలకు కనెక్టివిటీని అందిస్తుందన్నారు.