దౌల్తాబాద్ : ఆలయాల్లో వెండి, బంగారు నగలు చోరీ జరిగిన సంఘటన శనివారం అర్ధరాత్రి మండలంలోని పలు గ్రామాల్లోని చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండల కేంద్రంలోని ఈదమ్మ దేవాలయంలో కిలోన్నర వెండి (సుమారు రూ. లక్షవిలువ) ఉంటుందని ఆలయ నిర్వహకులు తెలిపారు. అలాగే మండలంలో లొట్టిగుండ తాండ గ్రామ పంచాయతీలోని మరియమ్మ-సేవాలాల్ ఆలయంలో ముక్కుపుడక, పుస్తేల తాడు దాదాపు తులం బంగారు నగలను (సుమారు లక్ష రూపాయల విలువ) గుర్తు తెలియని వ్యక్తులు ఆలయాలకు సంబంధించి తలుపుల తాళలు విరగొట్టి చోరీ చేసినట్లు గ్రామ సర్పంచు ముడావత్ కవిత పాండునాయక్ తెలిపారు.
ఈ సంఘనటపై ఆయా గ్రామాల సర్పంచులు, ఆలయ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని దౌల్తాబాద్ ఎస్ఐ రమేశ్ పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. మండలంలో అనుమానితులు ఉంటే పోలీసులకు గాని లేదా 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.