ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, గొల్లకుర్మ సంఘం నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కులవృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించి వారి అభివృద్ధికి దోహదడపుతున్నట్లు తెలిపారు.
రెండో విడుత గొరెల పంపిణీకి రూ. 6వేల కోట్లను కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు నట్టణ నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో జేఏడీ అంజలప్పతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.