పెద్దఅంబర్పేట : అందరూ చేనేత వస్త్రాలను ధరించడంతో పాటు చేనేత వృత్తికి సహకరించాలని గాంధీ గ్లోబల్ సంస్థ చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం కుంట్లూర్లోని గాంధీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేత నైపుణ్యం ప్రజలకు చేరువయ్యే విధంగా పలు కార్యక్రమాలు గ్లోబల్ సంస్థ చేస్తుందన్నారు.
అనంతరం పలువురు చేనేత కళాకారులను సన్మానించారు. కార్యక్రమంలో ఎడవల్లి లక్ష్మినారాయణ శాస్ర్తీ, మెరుగు మధు, గాంధీ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్రెడ్డి, బుర ధశరథ, గుండాల గొవర్ధన్, సురేందర్, సుభాశ్ చంద్ర, వాణి, కళాకారులు విష్ణుమూర్తి, విఠలేశ్వర్, కృష్ణ, విజయ్ పాల్గొన్నారు.