ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 22 : గత శాసనసభ ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేశ్ సోమవారం భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో నామిషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ క్యామ మల్లేశ్ గెలుపునకు బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, గ్రంథాలయసంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు బుగ్గరాములు, రమేశ్గౌడ్, రమేశ్, జంగయ్య, వెంకట్రెడ్డి, దామోదర్, శ్రీకాంత్, ఏర్పుల చంద్రయ్య, రవీందర్రెడ్డి, జక్క రాంరెడ్డి, సురేష్, ప్రభాకర్రెడ్డి, బలరాం, క్యామ శంకర్, సికిందర్రెడ్డి, మోహన్రెడ్డి, అంజిరెడ్డి, జగన్నాథం, వెంకటేశ్, రాజిరెడ్డి, యాదగిరి, రవీందర్రెడ్డి, ఐలయ్య, లక్ష్మారెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.