నందిగామ : ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని వెంకమ్మగూడలోని మల్లికార్జునస్వామి దేవాలయంలో అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. దేవుని నామస్మరణలోనే మనిషికి ముక్తి లభిస్తుందని, భగవంతుని ధ్యానంతో మనిషి ప్రశాంతత పొందుతారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో పాటు జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ హాజరై పూజలు నిర్వహించారు.
పీఏసీఎస్ చైర్మన్ అశోక్ అధ్వర్యంలో అయ్యప్పస్వాములు, భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నారాయణరెడ్డి, చేగూర్ పీఏసీఎస్ మాజీ చైర్మన్ విఠల్, సర్పంచులు అశోక్, జట్ట కుమార్, నాయకులు వీరేందర్గౌడ్, కాట్న శ్రీశైలం, యాదయ్య, అయ్యప్పస్వాములు పాల్గొన్నారు.