బొంరాస్పేట, ఏప్రిల్ 26 : సీపీఆర్ విధానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేయడం వల్ల వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చని ఎంపీడీవో పాండు అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందికి సీపీఆర్పై కులకచర్ల పీహెచ్సీ వైద్యులు వాజిద్అలీ అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి హేమంత్కుమార్ మాట్లాడుతూ గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తిని నేలపై వెల్లకిలా పడుకోబెట్టి రెండు చేతులతో ఛాతీ మధ్యలో బలంగా 30 సార్లు ప్రెస్ చేయాలని సూచించారు. సీపీఆర్ చేయడం వల్ల రక్త సరఫరా ఆగిపోయిన శరీర భాగాలకు తిరిగి రక్తం పంపిణీ అయ్యేలా చేస్తుందని, ఇంతలో మనిషి స్పృహలోకి వస్తాడని హేమంత్కుమార్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో దీని గురించి వివరించాలని అన్నారు. కార్యక్రమంలో సీహెచ్వో శివరాజ్ పాల్గొన్నారు.
సీపీఆర్తో నిండు ప్రాణాన్ని కాపాడొచ్చు
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ పద్ధతిని పాటించి నిండు ప్రాణాన్ని కాపాడొచ్చని కులకచర్ల మెడికల్ అధికారి వజిరుద్దీన్, బొంరాస్పేట మెడికల్ అధికారి హేమంత్ పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు. బుధవారం సీహెచ్సీ దవాఖానలో వైద్య బృందం సీపీఆర్ ద్వారా ప్రాణాన్ని కాపాడే పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని సీపీఆర్ పద్ధతిలో భాగంగా రెండు విధానాలను పాటించి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సీపీఆర్ పద్ధతిని చేపట్టిన తరువాత వ్యక్తికి ఎటువంటి చికిత్సను అందించాలో బొమ్మను ఉపయోగించి ప్రత్యక్షంగా చూపించారు. కార్యక్రమంలో సీఐ శంకర్, కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ ఎస్ఐలు రవి, శంకర్, రమేష్కుమార్లతో పాటు పోలీసు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.