దౌల్తాబాద్ : శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతి పంచాయతీ ఎన్నికల్లో మద్యం, డబ్బు అక్రమ రవాణా అడ్డుకట్ట వేశారు. అలాగే జిల్లా సరిహద్దుల్లోని చంద్రకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను జిల్లా జాయింట్ కలెక్టర్ లింగ్యానాయక్ శనివారం పర్యవేక్షించారు. చెక్పోస్ట్ల ఏర్పాటుతో పోలీసు నిఘాను మరింత కట్టుదిట్టం చేసి ఈసారి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పరిగి డీఎస్పీ, కొడంగల్ సీఐ, ఎస్లు తదితరులు పాల్గొన్నారు.
వాహనాల తనిఖీ ముమ్మరం
సాధారణ ఎన్నికల్లో సర్వైలైన్స్ స్టాటిస్టికల్ టీం(ఎస్ఎస్టీ), ఫ్లయింగ్ స్కాడ్లను ఏర్పాటు చేశారు. మండలం సరిహద్దులోని దేవర్ఫస్లవాద్, చంద్రకల్ వద్ద చెక్పోస్టులను ఏర్పాట్లు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ టీమ్లు పక్క రాష్ట్రం నుంచి మద్యం, డబ్బు రాకుండా అరికడతాయి. ఇటీవల జరిగిన సాధరణ ఎన్నికల్లో సైతం సత్ఫలితాలు రాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుతం ఎస్ఎస్టీంలు విధుల్లో కొనసాగుతూ వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్నాయి.
సరిహద్దుల్లో పటిష్ట నాకా బందీ
ఎన్నికల నేపథ్యంలో బార్డర్ ప్రాంతాల్లోని చెక్పోస్టుల్లో సిబ్బంది పటిష్టమైన నాకా బందీ నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, పరిడి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డి తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని కస్తూర్పల్లి, చంద్రకల్ గ్రామాల తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును వారు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. కర్ణాటక బార్డర్ కావడం వల్ల సిబ్బంది చాలా చురుకుగా ఉండి ప్రతి వాహనాన్ని చెక్ చేయడంతోపాటు అనుమానం ఉన్న వ్యక్తులను క్షణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. సజావుగా ఎన్నికలు జరిగేల చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ విజయ్కుమార్ను ఆదేశించారు.